Monday, April 29, 2024

 GHMC: ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. నగరంలోని గోశామహల్ SFA వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని చాధర్ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో చూసి కృత్రిమ వేలిముద్రలు తయారు చేశారు. ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్‌లోకి తీసుకెళ్లి పంచింగ్ చేశారు. 21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement