Sunday, April 28, 2024

Breaking : టిప్ప‌ర్ బీభ‌త్సం.. ఒక‌రు మృతి.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం..

చిత్తూరులో జిల్లాలోని కార్వేటినగరంలో టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నవారిపైకి టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత అనే యువతి మృతి చెందగా.. ఉదయ్‌, వెన్నెల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన టిప్పర్‌ డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సద్దుమనిగించేందుకు యత్నించారు. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement