Tuesday, April 30, 2024

టీడీపీకి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజీనామా

తిరుపతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదనే ఆవేదనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 15 ఏళ్లపాటు టీడీపీలో పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లేదని, రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులతో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తామని సిపాయి సుబ్రమణ్యం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement