Friday, April 19, 2024

తెలంగాణ ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి స్నాక్స్

తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ… స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు వాటిని ఇచ్చేందుకు ఏకంగా రూ.10 కోట్లు మంజూరు చేసింది విద్యాశాఖ. ఉదయం 8 గంటలకు స్కూలుకు వచ్చి ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటలు అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ స్నాక్స్ కోసం… ఒక విద్యార్థికి 15 రూపాయల చొప్పున ఖర్చు చేస్తుంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement