Tuesday, April 30, 2024

శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,821 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement