Sunday, April 28, 2024

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం – ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మార్చి 6 నుండి 19 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో సేవలందించిన 250 మంది గౌడ్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆలయ పరిపాలన భవనం వద్ద ఈవో పెద్దిరాజు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, రాష్ట్ర మండలి సభ్యులు టి. రమేష్ బాబు, స్కౌట్ మాస్టర్ అజారుద్దీన్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement