Tuesday, March 26, 2024

ముని కృష్ణారెడ్డి సేవలు అభినందనీయం.. వైకాపా యువత నాయకుడు మధు రెడ్డి

శ్రీకాళహస్తి – అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం పరమేశ్వరుని కృప కటాక్ష మని అటువంటిది ప్రతి సోమవారం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆయనకు వచ్చే శివ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి సేవలు అభినందనీయమని. జి మధు రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అల్పాహారo అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తుల సేవలో తమ వంతు సేవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రముఖ కాంట్రాక్టర్ మెప్పెటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇండియన్ బ్యాంక్ న్యాయ సలహా దారుడు సున్నపు లక్ష్మీపతి రెడ్డి వైకాపా 30 వ వార్డు ఇంచార్జ్ జి. మధు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం వారం భక్తులకు అన్నప్రసాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం పరమేశ్వరునికి నైవేద్యంతో సమానమని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడుతూ నిర్వాహకుడు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కుమార్ యాదవ్, శివ కుమార్, అరుణ ప్రముఖ నగిరి వీధి మొబైల్ హార్వర్డ్ నిపుణులు జుంలే షా ప్రశాంత్ మునిరెడ్డి, జయకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement