Sunday, April 28, 2024

తిరుపతిలో వ్యక్తిపై కత్తులతో దాడి

తిరుపతిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ‎బాధితుడు విశ్వనాథ్ ప్రాణభయంతో గోవిందరాజు స్వామి ఆలయంలోకి పరుగులు తీశాడు. టీటీడీ సెక్యూరిటీ సహాయంతో తీవ్ర గాయాలైన రౌడీషీటర్‎ను రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాధ్( 54) పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వనాథ్ కు శస్త్రచికిత్స జరిగితే తప్ప పరిస్థితి  చెప్పలేమని  వైద్యులు చెబుతున్నారు.

ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన విశ్వనాథ్, గౌరీ శంకర్ అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో విశ్వనాధ్ పై గౌరీ శంకర్ మరో ఇద్దరు కత్తితో దాడి చేసినట్లు ఈస్ట్ సిఐ శివ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement