Friday, March 29, 2024

భారత్‌కు మరో నిరాశ.. సెమీస్‌లో ఓడిన లవ్లీనా

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకంపై ఎన్నో ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ లవ్లీనా నిరాశపర్చింది. తాజాగా జరిగిన 69 కేజీల విభాగంలోని సెమీఫైనల్లో ఆమె ఓడిపోయింది. వరల్డ్ ఛాంపియన్ బుసెనజ్ సుర్మెనెలి (టర్కీ) పంచ్‌లకు లవ్లీనా పెద్దగా సమాధానం ఇవ్వలేకపోయింది. ఈ ఓటమితో లవ్లీనాకు కాంస్య పతకం వచ్చింది. కాగా ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌‌ను వీక్షించేందుకు మ్యాచ్ జరుగుతున్న 30 నిమిషాలపాటు అసోం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసింది. ఇప్పటికే బంగారు పతకం సాధిస్తుందని భావించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టిన భారత రెజ్లర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement