Sunday, April 28, 2024

రేపు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ర‌త్న‌ప్ర‌భ భేటి….

తిరుప‌తి – తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల‌లో బిజెపి – జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా మాజీ ఐఎఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ బ‌రిలోకి దిగ‌నున్నారు..ఈ ఎన్నిక‌ల‌లో కూట‌మి అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించేందుకు రేపు హైద‌రాబాద్ లో ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్,బిజెపి ఎపి శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, తిరుప‌తి బిజెపి అభ్య‌ర్ధి ర‌త్న‌ప్ర‌భ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు.. ఈ స‌మావేశంలో తిరుప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారానికి రావాల‌సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ర‌త్నప్ర‌భ కోర‌నున్న‌ట్లు స‌మాచారం.. కాగా, ఏపీలో గత కొంతకాలంగా బీజేపీ, జనసేనలు కూట‌మిగా ప‌ని చేస్తున్నాయి.. ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన కారణంగా తిరుపతి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిని పోటీకి నిలిపేందుకు జనసేన అంగీకరించింది. దీంతో అక్క‌డ బిజెపి త‌న అభ్య‌ర్దిని ప్ర‌క‌టించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement