Saturday, May 4, 2024

మొదటికి భర్తతో మూడు నెలలు..వేరొకరితో ముగ్గురు పిల్లలు – ఆఖరికి !!

ఇటీవల కాలంలో అనుమానంతో ఎంతో మంది కట్టుకున్న భార్యలను, తోడబుట్టిన వాళ్ళను సైతం చంపేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో ఓ వ్యక్తి భార్యను చంపి డ్రైనేజ్ లో తోసేసాడు. వివరాల్లోకి వెళ్తే కవిత, కమలాకర్ ఇద్దరూ కూడా మంచిర్యాల జిల్లా ఊత్కూరుకు లో నివాసం ఉండేవారు. కవిత, కమలాకర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కానీ మూడు నెలలకే విడాకులు తీసుకున్నారు. దీనితో మరో వ్యక్తిని కవిత పెళ్లి చేసుకుంది. వాళ్ళ దాంపత్య జీవితానికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పుడు అతనిని విడిచిపెట్టి తిరిగి కమలాకర్ దగ్గరికి కవిత వెళ్లి పోయింది. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో గత పదేళ్లుగా వీరిద్దరు కలిసి ఉంటున్నారు.

ఇక్కడివరకు బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాదులో మరో వ్యక్తితో కవిత చనువుగా ఉంటుంది. అది గమనించిన కమలాకర్ ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను తిరిగి లక్షెట్టిపేట కు తీసుకెళ్తానని చెప్పి అద్దె కారులో కరీంనగర్ దాకా తీసుకొచ్చాడు. అక్కడ కారు నుంచి దింపి కారును పంపించేశాడు. కోర్టు పక్కన బస్టాప్ లో ఇద్దరు గొడవ పడ్డారు. అక్కడే చున్నీతో కవిత మెడకు బిగించాడు. దీనితో ఊపిరి ఆడక కవిత చనిపోయింది. ఎవరైనా చూస్తారన్న భయంతో మృతదేహాన్ని డ్రైనేజీ లోకి నెట్టి కమలాకర్ అక్కడికెళ్లి పారిపోయాడు. 23 న ఈ ఘటన జరిగింది. కాగా నిందితుడిని ఇవాళ కరీంనగర్ లోని తన అక్క దగ్గరికి రాగా నిఘా వేసి పోలీసులు పట్టుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement