Friday, April 26, 2024

తిరుపతిలో బిజెపి విస్తృత ప్రచారం

రోడ్ షో ర్యాలీ లో అభ్యర్థి రత్నప్రభ

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం బిజెపి అభ్యర్థి రత్నప్రభ తిరుపతిలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక టీవీఎస్ షోరూం నుంచి కొర్లగుంట, మారుతి నగర్, జీవకోన ప్రాంతాల్లో రోడ్ షో, ర్యాలీలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. ఆమెతో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి రత్నప్రభ ను ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలకం అవుతుందన్నారు. ప్రచార ర్యాలీ లో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, డాక్టర్ పార్థసారథి, శాంతా రెడ్డి, అశోక్ యాదవ్ జనసేన నుంచి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జీవకోన లో….
భారతీయ జనతాపార్టీ తిరుపతి నగరం జీవకోన ప్రాంతానికి విచ్చేసిన బిజెపి అభ్యర్థి రత్న ప్రభ రోడ్ షో కు స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం వచ్చి విజయవంతం చేసినట్లు జీవకోన బిజెపి మండల అధ్యక్షుడు ఆర్ శరత్ కుమార్ తెలిపారు. సీనియర్ నాయకులు జె ఎం రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు హరి నాయుడు, గారు వల్లేపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు, మండల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement