Sunday, April 28, 2024

బిజెపికి ఓటు అభివృద్ధికి మలుపు……….. బిజెపి అభ్యర్థి రత్నప్రభ

రేణిగుంట : బిజెపి కి ఓటు అభివృద్ధికి మలుపు అని భారతీయ జనతా పార్టీ – జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి రత్నప్రభ స్పష్టం చేశారు. రేణిగుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం అన్నారు. నరేంద్ర మోడీ సారధ్యంలో దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బిజెపి రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవాలి అంటే బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు. జరుగుతున్న ఎన్నికలు స్థానిక సంస్థల కాదని రాష్ట్రం ఎన్నికలు కాదని దేశానికి సంబంధించిన ఎన్నికలు అని పేర్కొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్, రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ కోట వినుత, తిరుపతి పార్లమెంటు ఓబీసీ జిల్లా అధ్యక్షులు బీడి బాలాజీ, బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు కోట చంద్రబాబు, రాజా రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement