Thursday, May 2, 2024

నిరుద్యోగులతోనే టిఆర్‌ఎస్‌ పతనం..

రాజాపూర్‌ : మండల కేంద్రంలో బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ… నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని పురుగుల మందు సేవించి మరణించిన బోడ సునిల్‌ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌ గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ కోసం బిజెపి తరపున పోరాటాలు చేసి సాధిస్తామన్నారు. నిరుద్యోగ యువకులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పారు. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడి కన్నతల్లిదండ్రులకు కడుపుకోత కల్గించొద్దని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని , లేనియెడల నిరుద్యోగుల చేతనే ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధు , రాజు , ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement