రాజాపూర్ : మండల కేంద్రంలో గల రెయిన్బో హోటల్ ఆవరణలో ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డిని మొత్కుల కుంట తండా సర్పంచ్ రవి నాయక్ తండా వాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ప్రకారం గిరిజన తండాలను పంచాయితీలుగా ఏర్పాటు చేసింది. అలాగే గిరిజనుల అభివృద్ది కోసం రాజకీయంగా వారు ఎదిగితేనే సాధ్యం అని వివిధ పదవుల్లో గిరిజనులకు పెద్ద పీట వేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మండల కేంద్రం నుంచి మోత్కుల కుంట తండా , మర్రి బాయి తండా వరకు బీటీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ నాయక్ , బాలీశ్వర్ , రాములు , సేవ్య , లక్ష్మణ్ , రమేష్ , శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement