Sunday, May 5, 2024

తిరుపతిలో వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధం

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈరోజు అర్ధరాత్రి అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర జరుగనుంది. రేపు ఉదయం నుంచి భక్తజనులకు అమ్మవారి సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. లక్షలాది భక్తజనులు, వీఐపీలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 4 గంటల నుండి అమ్మవారి విరూపణ శోభాయాత్ర నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం అమ్మవారి విరూపణతో వెంకటగిరి జాతర ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement