Sunday, May 5, 2024

శ్రీవారి భక్తులకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

చంద్రగిరి : పూతల పట్టు – నాయుడుపేట జాతీయ రహదారిలో చంద్రగిరి వద్ద‌ బుధవారం శ్రీవారి భక్తుల కారు దగ్ధం అయింది ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వారికి ఎటువంటి గాయాలు కాలేదు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వేలూరుకు వెళుతుండగా చంద్రగిరి బైపాస్ లో గల ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద కార్ లో వైర్లు షార్ట్ సూర్కుట్ కావటంతో మంటలు చెలరేగాయి. వెంటనే కారును పక్క‌కు ఆపివేసి ప్ర‌యాణికులు దిగి దూరంగ పరుగులు తీశారు. స్థానికులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే సరికే పూర్తిగా కారుకు మంటలు చుట్టుముట్టాయి. వెంటనే ఫైర్ సిబ్బంది కారు మంటలను అదుపు చేశారు. చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement