Thursday, April 25, 2024

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు..

మణికొండ మున్సిపాలిటీ సాయిబాబా గుడిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సాయిబాబా దేవాలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని మణికొండ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కే.నరేందర్ రెడ్డి దంపతులు, కౌన్సిలర్ మీనా ముత్యాలు దంపతులు సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించి మొక్కలు చెల్లించారు. మున్సిపాలిటీ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నరేందర్ రెడ్డి, మీనా ముత్యాలు కోరుకున్నామన్నారు. తెల్లవారుజాము నుండి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసిందని ఆలయ కమిటీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement