Monday, May 13, 2024

తిరుపతిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్….

తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట‌ర్లు ఉద‌యం నుంచే బారులు తీరారు.. కొవిడ్ నిబంధ‌న‌లకు అనుగుణంగా బౌతిక దూరం పాటిస్తూ ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. తొలి రెండు గంట‌ల‌లో తిరుప‌తిలో 11.45 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్‌ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement