Wednesday, May 8, 2024

ప్ర‌కాశం జిల్లాలో 13.92 శాతం పోలింగ్ .. ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఎంపి మాగుంట‌..

ఒంగోలు – ప్ర‌కాశం జిల్లాలో మునిసిప‌ల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట‌ర్లు ఉద‌యం నుంచే బారులు తీరారు.. కొవిడ్ నిబంధ‌న‌లకు అనుగుణంగా బౌతిక దూరం పాటిస్తూ ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. తొలి రెండు గంట‌ల‌లో ప్ర‌కాశం జిల్లాలో 13.92 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక ఒంగోలులో ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి త‌న ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఇక తొలి రెండు గంట‌ల‌లో ఒంగోలు న‌గ‌ర పాల‌క సంస్థ‌లో 14.59 శాతం పోలింగ్ న‌మోదైంది.. ఇక చీరాల‌లో 10.73 శాతం, మార్కాపురంలో 10 శాతం, అద్దంకిలో 20.26 శాతం, చీమ‌కుర్తిలో 17. 57, క‌నిగిరిలో 15.70 శాతం, గిద్ద‌లూరులో 14.26 శాతం పోలింగ్ న‌మోదైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement