Wednesday, May 22, 2024

ఆప్తమిత్రుడ్ని కోల్పోయా, మాజీ మంత్రి బొజ్జలకు చంద్రబాబు అశ్రునివాళి

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో (రాయలసీమ): గోపాలకృష్ణారెడ్డి మరణంతో ఆప్తమిత్రుడిని కోల్పోయానని, మాట చెబితే తూచ తప్పకుండా అమలు చేసే గోపాల్‌ మరణం తీరని ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు గ్రామంలో జరిగిన మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆదివారం చంద్రబాబు వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఊరందూరు చేరుకున్న ఆయన గోపాలకృష్ణారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై గోపాలకృష్ణారెడ్డి మృతదేహాన్ని కొంతదూరం మోసిన చంద్రబాబు అంత్యక్రియలు అయ్యేదాకా ఉన్నారు. అనంతరం గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్య బృందమ్మను, ఇతర కుటుంబసభ్యులను పరామర్శిస్తూ వారి కుటుంబానికి తాను తోడుగా ఉంటానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement