Wednesday, May 8, 2024

AP: రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలు నుంచి ఇవాళ‌ సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. చంద్రబాబు విడుదల కావడంతో సంబరాలు చేసుకున్న తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘జై తెలుగుదేశం.. జై జై చంద్రబాబు’ అంటూ కార్యకర్తల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్‌, చింతమనేని ప్రభాకర్‌, కంభపాటి రామ్మోహన్‌ రావు, టీడీ జనార్థన్‌ సహా పలువురు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement