Sunday, May 5, 2024

AP | రేష‌న్ షాపుల్లో పప్పుధాన్యాల సరఫరా.. రేప‌టినుంచే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నవంబర్ నుంచి కందిపప్పును కూడా పంపిణీ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి కొద్ది నెలల క్రితమే కందిపప్పును కూడా ఇస్తామని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. కానీ, కందిపప్పు కొరత కారణంగా పంపిణీ చేయలేకపోయింది. అయితే నవంబర్ నుంచి కచ్చితంగా ఏపీలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు కందిపప్పును కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.130 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. అయితే రేషన్ కార్డు లబ్ధిదారులకు సబ్సిడితో కిలో కందిపప్పును రూ. 67 కే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 50,000 టన్నుల కందిపప్పును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరింది.

ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (HACA) నుంచి 10 వేల టన్నుల కందిపప్పును కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం వెంటనే హాకా కు 10 వేల టన్నుల కందిపప్పు సరఫరా చేయాలని ఆర్డర్ చేసింది. అయితే హాకా వద్ద నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతం 7,200 టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా చేస్తామని తెలిపింది.

- Advertisement -

దీంతో నవంబర్, డిసెంబ్, జనవరి నెలల్లో కందిపప్పు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ముందుగా హాకా నుంచి తొలి విడతలో 3,660 టన్నుల కందిపప్పును ప్రభుత్వం అందుకోనుంది. రెండో విడతలో 3,540 టన్నుల సరఫరా కానుంది. నవంబర్ లో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 2,300 టన్నుల కందిపప్పును తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement