Sunday, April 28, 2024

NZB: కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా… బీజేపీ అభ్యర్థి ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి
ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కార్మికుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమాలు ప్రవేశ పెట్టిందన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ఎంకే గార్డెన్ లో కొత్త గంజ్ లో గుమస్తా, దడువై, హమాలీ, చాట, ముల్లె, యూనియన్ సభ్యుల ఆత్మీయ సమావేశా నికి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ… కొత్త గంజ్ కార్మిక సోదర, సోదరిమనులే శ్రీ రామరక్షా అని అన్నారు.

ఎన్నికల సమయంలో వచ్చే ప్యారాచూట్ లీడర్ లని నమ్మొద్దన్నారు. మీ సంఘాలకి అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. తన ట్రస్ట్ ద్వారా చాలా మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదం తన పైన ఉండాలన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కార్మిక భవన్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మర్చంట్ అధ్యక్షులు లభిషేట్టి శ్రీనివాస్, గుమస్తా ఆధ్యక్షులు కరిపే సత్యం, దడువై అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హమలి అధ్యక్షులు సాయిలు కార్యదర్శులు బాలు, సాయిలు, కరిపే గణేష్, కార్మిక సోదరులు గంజ్ యునియన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement