Monday, May 20, 2024

రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి మృతిపై చంద్రబాబు సంతాపం

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మృతిపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. యడ్లపాటి మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరం అని చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన వెంకట్రావు గారి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి…తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారన్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… వెంకట్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement