Tuesday, May 7, 2024

CRIME: విజయవాడలో రౌడిషీటర్ దారుణ హత్య.. బ్లేడ్ బ్యాచ్ పనేనా?

విజయవాడలో ఓ రౌడిషీటర్ దారు హత్యకు గురైయ్యాడు. విజయవాడ  నగర శివారు రామవర్పపాడు ఫ్లైఓవర్ సమీపంలో అద్దంకి మోహన్ కుమార్(చిన్న) అనే రౌడిషీటర్ ను దుండగులు హత్య చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రక్తపు మడుగులో మోహన్ కుమార్ మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రౌడీషీటర్‌ మోహన్ కుమార్ కు బ్లేడ్ బ్యాచ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement