Sunday, May 19, 2024

నేడు ఐక్య‌రాజ్య స‌మితి అత్య‌వ‌స‌ర భేటీ

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈరోజు అత్య‌వ‌స‌రంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఖండించనున్నారు. 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమై రష్యా దూకుడుపై చర్చించనుంది. అంతర్జాతీయ నిబంధనలను రష్యా అతిక్రమిస్తుందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఇప్పటికే భద్రతా మండలిలో దీనిపై చర్చ జరిగింది. రష్యా దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. భద్రతా మండలిలో ఓటింగ్ కూడా జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానంలో 11 దేశాలు అనుకూలంగా ఓట్లు వేయగా, భారత్, చైనా, యూఏఈలు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement