Sunday, April 28, 2024

AP: భోగి వేళ అమరావతిలో చంద్రబాబు, పవన్ ల నిరసన మంటలు..

అమరావతిలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రేపు జరిగే భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు.

రా కదలి రా పేరుతో టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement