Thursday, May 2, 2024

Electric shock: గాలిప‌టం ఎగ‌రేస్తూ బాలునికి విద్యుత్ షాక్‌

గాలిప‌టం ఎగ‌ర‌వేయాల‌నే స‌ర‌దా ఓ ప్రాణాన్ని బ‌లిగొంది. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో గాలిపటాలు ఎగరేస్తూ ఓ బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంక్రాంతి పండగ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురేస్తున్నారు.

ఈ క్రమంలో పతంగి విద్యుత్ తీగలకు చిక్కుకుని విద్యుదాఘాతానికి గురైంది. విషయం తెలియని బాలుడు.. గాలిపటాన్ని సరిచేసే క్రమంలో తానూ షాక్ కు గురయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement