Thursday, May 2, 2024

ఏపీకి నలుగురు ఐపీఎస్‌లను కేటాయించిన కేంద్ర హోంశాఖ

కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలుగురు యువ ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. యూపీఎస్‌పీ -2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష (ఢిల్లీ), సీహెచ్‌.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి (ఏపీ), ఎస్‌.అంకిత మహవీర్‌ (మహరాష్ట్ర), నవ్‌ జ్యోతి మిశ్రా (బిహార్‌)లను ఏపీ కేడర్‌కు అటాచ్‌ చేసింది. ఈ నలుగురు యువ అధికారులు హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement