Thursday, May 2, 2024

వివేకా హత్య కేసు: పులివెందుల కోర్టుకు సీబీఐ విచారణాధికారి

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోంది. సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పులివెందుల కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కలసి హాజరయ్యారు. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబందించి సిబిఐ వద్ద వున్న సిట్ బృందాల 1, 2 నివేదికలను కోర్టుకు సమర్పించే విదంగా సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలని ఇటీవల పులివెందుల కోర్టులో ఎ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఇరుపక్షాల వాదనలు వినిపించారు. కేసు విచారణ దశలో వున్నప్పు డు సిబిఐ వద్ద వున్న డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించ లేమని తేల్చి చెప్పిన సిబిఐ తరుపు పబ్లిక్ ప్రాసిక్యూటర్..విచారణ రేపటికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement