Friday, May 3, 2024

AP: విజయవాడలో కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

విజయవాడ: కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో ముగ్గురికి గాయాలైన ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటుచేసుకుంది. బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ మీద నుంచి ముగ్గురు విద్యార్థులపైకి దూసుకెళ్లింది. హుటాహుటిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ప్రమాదస్థలిలో పదుల సంఖ్యలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనపై గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగంగా కారును నడపడం, ఆపై దానిని నియంత్రించలేకే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement