Wednesday, May 8, 2024

హెలికాఫ్ట‌ర్ రైడ్ ద్వారా.. తిరుమ‌ల అందాలు వీక్ష‌ణ‌

తిరుమ‌ల అందాల‌ను వీక్షించేందుకు ఏరో డాన్ అనే సంస్థ హెలికాఫ్టర్ రైడ్ ని ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి 19 వరకు ట్రయల్స్ నిర్వహించనున్నారు. టికెట్ బుకింగ్ లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా ఆసక్తి ఉన్నవారు ఈ హెలికాప్టర్ లో తిరుపతి, పరిసర ప్రాంతాల అందాలను గగనతలం నుంచి వీక్షించవచ్చు. అందుకోసం ఒక్కొక్కరు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాయ్ రైడ్ 8 నిమిషాలు ఉంటుంది. ఈ రైడ్ కోసం 6 సీట్ల సామర్థ్యం ఉన్న హెలికాప్టర్ ను వినియోగించనున్నారు. పైలెట్ తో పాటు మరో ఐదుగురు పర్యాటకులు దీంట్లో ప్రయాణించవచ్చు. రైడ్ లో భాగంగా తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు తీసుకెళ్లి, తిరిగి తిరుపతి తీసుకువస్తారు. గంటకు 6 ట్రిప్పులు వేసేలా ఏరో డాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. శ్రీవారి భక్తులే కాకుండా, తిరుపతి వాసులు కూడా ఈ హెలికాప్టర్ రైడ్ ను ఆస్వాదించవచ్చని ఏరో డాన్ సంస్థ వెల్ల‌డించింది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారు. వారిలో కొందరు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఆలయాలను, వివిధ పర్యాటక ప్రదేశాలను కూడా దర్శిస్తుంటారు. ఇలా తిరుమల వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏరో డాన్ అనే సంస్థ హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేయ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement