Thursday, May 16, 2024

విద్యుత్ షాక్ తో అన్నదమ్ముల మృతి

విద్యుత్ షాక్ కు గురై అన్న‌ద‌మ్ములు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం పాలకోసం వెళ్లి విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.

పొలం వద్ద ఉన్న గేదేల నుంచి పాలు తీసుకొచ్చేందుకు వెళ్లిన అన్నదమ్ములు నాగేంద్ర (19), ఫణీంద్ర (17) దారిలో తెగిపడిన విద్యుత్‌ తీగలు గమనించకుండా త‌గ‌ల‌డంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించడంతో స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement