Wednesday, May 8, 2024

Breaking: చిత్రావ‌తిలో చిక్కుకున్న కారు.. కాపాడేందుకు వెళ్లిన జేసీబీ అటే..

భారీ వ‌ర్షాల‌తో అనంతపురం జిల్లాలో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. చెన్నేకొత్తపల్లి మండలంలోని వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. కాగా, కారుతో నది దాటేందుకు య‌త్నించిన వ్య‌క్తులు వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకున్నారు. ఆ కారులో నలుగురు వ్యక్తులున్న‌ట్టు పోలీసులు తెలిపారు. వారిని కాపాడేందుకు రెస్య్కూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

అయితే జేసీబీ సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద పోటెత్తి జేసీబీ కూడా నీటి ప్రవాహంలోనే ఇరుక్కుపోయింది. jcbతో పాటు పోలీసు సిబ్బంది, కాపాడేందుకు వెళ్లిన గ్రామస్తులు కూడా అక్క‌డే చిక్క‌కున్నారు. వ‌ర‌ద నీటిలో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారిని కాపాడేందుకు తీవ్రంగా య‌త్నిస్తున్న‌ట్టు ధ‌ర్మ‌వ‌రం డీఎస్‌పీ ర‌మాకాంత్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement