Sunday, April 28, 2024

బ్ల‌డీ ఫూల్స్‌, మీ బాక్స్‌లు బ‌ద్ద‌లైత‌య్‌.. జ‌బ‌ర్ద‌స్త్ రేంజ్‌లో రోజా డైలాగ్స్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అని ఫైరయ్యారు మంత్రి రోజా. అలాంటి వారందరి బాక్సులు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బద్దలైపోతాయని జ‌బ‌ర్ద‌స్త్ స్టైల్‌లో చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనా, విభజిత ఏపీ అయినా.. ఇప్పటి దాకా తెలుగు వాళ్లని పాలించిన 15మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాస్తున్నది సీఎం జగన్ ఒక్కరేనని అన్నారు రోజా.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంకోసం మండలానికి ఓ మంత్రిని ఇన్‌చార్జిగా నియమించారు సీఎం జగన్. చేజర్ల మండలానికి రోజా ఇన్‌చార్జిగా ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఇవ్వాల విసృత‌ పర్యటనలు చేస్తున్నారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీ సాధిస్తామని మంత్రి ఆర్‌కే రోజా ధీమా వ్యక్తం చేశారు. జనసేన అయినా, వైఎస్సార్‌సీపీ అయినా, టీడీపీ అనే వ్యత్యాసం లేకుండా అన్ని పార్టీ నేతలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని బలపరచాల్సిన అవసరం ఉంద‌ని, ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి కుటుంబాన్ని గెలిపించి, గౌతమ్ రెడ్డికి ఘన నివాళి ఇవ్వాలని స్థానిక ప్రజలకు మంత్రి రోజా పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement