Monday, May 6, 2024

అవు లేగదూడకి ఘనంగా బారసాల

కృష్ణాజిల్లా జిల్లా మచిలీపట్నంలో డాబాలసెంటర్ లో ఇటీవల జన్మించిన ఓ అవు లేగదూడకి ఘనంగా బారసాల నిర్వహించి మూగజీవాల తమకున్న ప్రేమను చాటుకున్నారు. గత నెల జూలై 6 తేదీన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బంగారం అనే గోవుకి అడ లేగదూడ జన్మించింది. సాధారణంగా మనుషులకు చేసే నెలలోపు చేసే ఉయ్యాల వేడుకలా.. లేగదూడకి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ముత్తైదువులకు అహ్వనించారు. తల్లి గోవు (బంగారం)గర్భిణీగా  ఉన్న సమయంలో సీమంతం నిర్వహించినట్లు పోషకరాలు మైథిలి తెలిపారు. మూగజీవాల కుటుంబ సభ్యులుగా చూడటం వల్ల వాటిపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు మైథిలి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement