సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల విడుదల అనేక సార్లు వాయిదా పడింది. వాస్తవానికి జులై 20న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: వీడియో: కర్రసాములో ఇరగదీసిన పవన్ తనయుడు అకిరానందన్