Sunday, May 5, 2024

ఆగస్టు 9 బొమ్మ దద్దరిల్లిపోద్ది….

మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఆగస్టు 9 మహేష్ బర్త్ డే సందర్భంగా అసలైన ట్రీట్ బ్లాస్ట్ ఉందని పేర్కొంది. మరోసారి అసలైన మాసివ్ స్వాగ్ విట్నెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అలాగే ఈసారి మోతకి బొమ్మ దద్దరిల్లిపోద్ది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆగస్టు 9న ఎలాంటి అప్డేట్ ఉంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement