Saturday, April 27, 2024

Big Breaking: విశాఖ‌లో ఘోరం.. బీమిలీ బీచ్‌లో ఇద్ద‌రు విద్యార్థుల గ‌ల్లంతు

విశాఖ బీమిలీ బీచ్‌లో ఇద్ద‌రు విద్యార్థులు గల్లంత‌య్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు క‌లిసి స‌ర‌దాగా ఈత‌కోసం వెళ్ల‌గా అందులో ఇద్ద‌రు స‌ముద్రంలో గ‌ల్లంతైన‌ట్టు తెలుస్తోంది. వీరికోసం నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్ట‌ర్ సాయంతో గ‌ల్లంతైన వారికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పూర్తిగా సృహ‌త‌ప్పిన స్థితిలో ఉన్న విద్యార్థుల‌ను రెస్య్కూ చేసి కాపాడిన‌ట్టు తెలుస్తోంది. వీరిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement