Sunday, May 12, 2024

Breaking: హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతనే సీబీఐ విచారణకు హాజరవుతానని అన్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. తమకు సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement