Sunday, April 28, 2024

ఏపీలో దారుణం, బాలికపై గ్రామ వలంటీర్​ పైశాచికం – మూడు నెలలుగా ఆపని..

ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్తున్న కిరాతకుడి దురాగతం బయటపడింది. ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింఇ. ఓ మైనర్ బాలికపై గ్రామ వలంటీర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసి అంతా షాక్​కి గురవుతున్నారు. బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్లి అయ్యి.. భార్యతో కలిసే ఉంటున్నాడు. మంచి ఉద్యోగం, భార్యతో సంతోషంగా సాగుతున్న జీవితాన్ని అతడు చేజేతులా నాశనం చేసుకున్నాడు. అంతేకాకుండా మరో చిన్నారి జీవితంతో ఆడుకున్నాడు. ఇంట్లో భార్య ఉన్నప్పటికీ నీచపు ఆలోచనలతో రగిలిపోయిన కోటయ్య అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు.

తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఆ బాలిక అమ్మమ్మ వద్ద ఉంటోంది. దీంతో ఆ బాలికను ఏంచేసినా గట్టిగా అడిగేవారెవరూ లేరని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న అతడు మూడు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొందంటూ బెదిరించడంతో బాలిక అలాగే చేసింది. ఇలా వలంటీర్ చేతిలో ఆటబొమ్మగా మారింది ఆ చిన్నారి.

అయితే.. ఇటీవల కోటయ్య వికృతచేష్టలు ఎక్కువ కావడంతో బాలిక భరించలేకపోయింది. దీంతో తనవద్దకు తల్లిదండ్రులు వచ్చిన సమయంలో ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు పోక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు. తాను చేసిన నీచపు పని బయటపడిందని తెలియడంతో ప్రస్తుతం వలంటీర్ కోటయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement