Wednesday, May 22, 2024

అపాచి సంస్థలో 10 వేల మందికి ఉపాధి : మంత్రి అమర్నాథ్‌..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుపతి జిల్లాలో ఈనెల 23న సీఎం జగన్‌ పర్యటించనున్నారని ఈ పర్యటనలో అపాచి సంస్థకు సిఎం శంకుస్థాపన చేయనున్నారని ఈ సంస్థ ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ఉపాది రానుందని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేణిగుంట వద్ద రెండువేల కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సంస్థలను సిఎం ప్రారంభించనుండడంతో పాటు మరో రెండు సంస్థలకు శంఖుస్థాపన చేస్తారన్నారు.

త్వరలోనే విశాఖలో ఇన్ఫోసిస్‌ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తిరుపతి, విజయవాడలలో ఐటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో మైలు ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడడం అనవసరమని, అయ్యన్నపాత్రుడి ఇంటి పై అధికార యంత్రాంగం జేసిబీలతో దాడి అంశం పై మాట్లాడేందుకు ఆయన ని రాకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement