Saturday, April 27, 2024

AP – అమెరికాలో టీడీపీ నేత‘మ‌న్నెం’ క‌న్నుమూత


(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్) – న్యూ జెర్సీ – టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) అకస్మికంగా కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా మన్నెం వెంకటరమణ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే మన్నెం వెంకట రమణాను ఏథెన్స్ ఎయిర్ పోర్టు లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమం కావడంతో మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీలో, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మన్నెం వెంకటరమణ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ సంతాపం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement