Saturday, April 27, 2024

వైరల్ అయిన ఆడియోపై మంత్రి అవంతి వివరణ

ఓ మహిళతో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాసలీలల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన మాట విని ఇంటికొస్తే అరగంటలో పంపించేస్తానని, వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ మహిళతో ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆ ఆడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి అవంతి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో నకిలీదని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎవరెవరో తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడుగుతుంటే బాధగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని గుర్తు చేశారు. వైసీపీకి మహిళ్లలో విపరీతమైన ఆదరణ పెరుగుతోందన్నారు. తనను ఇబ్బంది పెట్టినవారు ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి చెప్పారు. నిందితులు ఎవరన్నది త్వరలోనే తేలుతుందన్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరన్న మంత్రి.. తాను పార్టీలో గ్రూపులు నడపడం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండిః మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement