Friday, April 26, 2024

Corona update: ఏపీలో కొత్తగా 156 కేసులు.. మూడు మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 31,131 మంది సాంపిల్స్ ని పరీక్షించగా.. 156 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడచిన 24 గంటల్లో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,74,708కి చేరింది. ఇందులో 20,58,289 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14,465 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,954 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement