Friday, May 3, 2024

Andhra Pradesh- ఆలూరులో భారీగా మద్యం పట్టివేత

ఆలూరు స‌బ్ స్టేషన్ పరిధిలోని వాహ‌నంలో మద్యాన్ని త‌ర‌లిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు బండి రస్తాలో వంక వద్ద కర్నూల్ జిల్లా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ఇ.నరసానాయుడు త‌న సిబ్బందితో త‌నిఖీలు చేస్తున్న‌స‌మ‌యంలో ఈ వాహ‌నం ప‌ట్టుబ‌డింది…

మినీవ్యాన్ లో కర్ణాటక రాష్ట్రంకు చెందిన 80 మద్యం బాక్సులు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.అందులో ఉన్న హోలగుంద మండలంకు కే.మంజునాథ అరెస్టు చేశారు.. డ్రైవర్ తౌసీఫ్ అలియాస్ సమూద్ పరారయ్యాడు. ఈ మ‌ద్యం విలువ రూ.4. 84 లక్షలు. . ఇక కేసులను నిందితుడైన మంజునాథను రిమాండ్ కి తరలించారు.

- Advertisement -

ఈ కేసుతో సంబంధం ఉన్న మ‌రో ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగరాజు ,కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు టీములను ఏర్పాటు చేశారు. ఈ త‌నిఖీల‌లో ఎస్సై సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి, హెడ్ కానిస్టేబుల్ లు వెంకటరాముడు, రాముడు, ఈసీ లు షెక్షవలి, నాగరాజు, బషీర్ , కరుణాకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement