Thursday, April 25, 2024

తాడిప‌త్రిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల బాహాబాహీ

తాడిపత్రి టౌన్, మార్చి 6 (ప్రభ న్యూస్) : అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల‌ బహాబాహి కార‌ణంగా ఆర్టీఏ ఏజెంట్ షాప్ అద్దాలు ధ్వంసమ‌య్యాయి.. వివరాలిలా ఉన్నాయి… తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలీ మరికొందరితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా వైసీపీకి చెందిన అడ్డు రఫీతో పాటు మరికొందరు కవ్వింపు చర్యలకు పాల్పడగా, ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సల్లావుద్దీన్ అనే వ్యక్తికి చెందిన ఆర్టీఏ ఏజెంట్ కార్యాలయం అద్దాలు ధ్వంసమ‌య్యాయి. ఇరువురికి పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement