Thursday, May 2, 2024

Breaking : వాజేడు గోదావరిలో మృతదేహం లభ్యం

వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని గోదావరిలో మృతదేహం లభ్యమయింది. వాజేడు గ్రామానికి చెందిన పూనెం శరత్ (27)గా గ్రామస్తులు గుర్తించారు. గత 4 రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయిన శరత్ గోదావరిలో శ‌వ‌మై తేలడంతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement