Sunday, May 19, 2024

గణేశ్‌ నిమజ్జనంలో విషాదం.. ఒకరి మృతి

అనంతపురం పట్టణంలోని సాయినగర్ లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్‌ ఉత్సవాల అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఇవాళ నిమజ్జనం కోసం రాప్తాడు పండమేరు కాలువకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా నీటి ప్రవాహానికి నలుగురు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు మృతి లభ్యంకాగా గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement